ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ మద్దతు: మాధవ్
ABN , First Publish Date - 2022-01-01T01:03:10+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ
విశాఖపట్నం: ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు. వారిని వర్గాలుగా విడదీసి ఉద్యమాన్ని దెబ్బతీయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఫిట్మెంట్, వారి న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఉదారంగా వ్యవహరించి పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ నాయకత్వం వహిస్తుందని మాధవ్ పేర్కొన్నారు.