బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయి: మధుయాష్కీ

ABN , First Publish Date - 2022-07-05T21:48:22+05:30 IST

రాహుల్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సూచించారు. కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయి: మధుయాష్కీ

హైదరాబాద్: రాహుల్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సూచించారు. కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. పార్టీని నమ్మి పని చేసినవారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. టికెట్ కోసమే వచ్చి పనిచేసే వారికి టికెట్లు ఉండవన్నారు. కాంగ్రెస్ బలోపేతాన్ని అడ్డుకోవడానికి తెరచాటున కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయని, ఈ కుట్రను గమనించాలన్నారు. 

Updated Date - 2022-07-05T21:48:22+05:30 IST