Rs 35 crores: మదురై విమానాశ్రయం విస్తరణ
ABN , First Publish Date - 2022-08-18T15:21:31+05:30 IST
మదురై విమానాశ్రయ విస్తరణ కోసం రూ.35 కోట్లతో ప్రహరీ నిర్మించేందుకు భారత విమానాశ్రయాల కమిషన్ టెండర్ మంజూరు చేసింది. మదురై
- రూ.35 కోట్లతో ప్రహరీకి టెండరు మంజూరు
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 17: మదురై విమానాశ్రయ విస్తరణ కోసం రూ.35 కోట్లతో ప్రహరీ నిర్మించేందుకు భారత విమానాశ్రయాల కమిషన్ టెండర్ మంజూరు చేసింది. మదురై విమానాశ్రయ(Madurai Airport) విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడు విమానాలు దిగేందుకు అనుకూలంగా స్థలాన్ని కూడా కేటాయించారు. కొత్తగా ఎయిర్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టారు. అంతేకాకుండా, అండర్ పాస్ విధానంలో విశాలమైన్ రన్వేలతో విదేశీస్థాయి విమానాశ్రయం(Airport)గా పెద్ద విమానాలు దిగి, వెళ్లేలా ప్రస్తుతం రన్వే పొడవును 7,500 అడుగుల నుంచి 12,500 అడుగులకు విస్తరింపజేస్తున్నారు. విస్తరణ పనుల నిమిత్తం అవసరమైన 100 ఎకరాలు మినహా మిగతా భూములను భూ యజమానుల నుంచి రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తయింది.