మదురై-రామేశ్వరం రైలు సేవలు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2022-05-31T15:46:41+05:30 IST
కరోనా వ్యాప్తి కారణంగా నిలిపివేసిన మదురై-రామేశ్వరం రైలుసేవలను రెండేళ్ల అనంతరం సోమవారం ప్రారంభించినట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. కరోనా ప్రభావం ఉన్న
ప్యారీస్(చెన్నై): కరోనా వ్యాప్తి కారణంగా నిలిపివేసిన మదురై-రామేశ్వరం రైలుసేవలను రెండేళ్ల అనంతరం సోమవారం ప్రారంభించినట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. కరోనా ప్రభావం ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య నడుపుతున్న రైళ్లసేవలను రైల్వే శాఖ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం కరోనా ప్రభావం చాలావరకు తగ్గిపోయిన కారణంగా రైళ్లసేవలు పునరుద్ధరించాలని ప్రజలు రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, సోమవారం ఉద యం 6.35 గంటలకు మదురై నుంచి రామేశ్వరానికి ప్యాసింజర్ రైలు బయల్దేరి వెళ్లింది. తిరుగు మార్గంలో ఆ రైలు సాయంత్రం రామేశ్వరం నుంచి మదురైకు నడుపనున్నట్లు మదురై డివిజినల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు రామేశ్వరం, పాంబన్, మండపం, మండపం శిబి రం, ఉచ్చుపుళి, రామనాథపురం, పరమకుడి, మానామదురై, త్రిభువనం, మదురై తూర్పు స్టేషన్లలో ఆగి వెళుతుందని తెలిపే టైంటేబుల్ కూడా రైల్వే శాఖ విడుదల చేసింది.