Kaleswaram: ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే: మధుయాష్కీ

ABN , First Publish Date - 2022-07-22T22:17:00+05:30 IST

కాళేశ్వరం(Kaleswaram) ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని కాంగ్రెస్ నేత మధుయాష్కీ(Madhuyashki) అన్నారు.

Kaleswaram: ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే: మధుయాష్కీ

ఢిల్లీ: కాళేశ్వరం(Kaleswaram) ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని కాంగ్రెస్ నేత మధుయాష్కీ(Madhuyashki) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఐఏఎస్‌ రజత్ కుమార్‌ను( Rajat Kumar) వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.మేఘాలు బద్ధలు కాలేదు.. మేఘా అవినీతి బద్ధలైందన్నారు.మేఘా ఇంజనీరింగ్ అధినేతను అరెస్ట్ చేయాలన్నారు. కేసీఆరే(KCR) ఇంజనీర్, డాక్టర్, మేధావి అని సెటైర్లు వేశారు. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందన్నారు.అవినీతి చేయకున్నా కేంద్రం కాంగ్రెస్ నేతలపై ఈడీ నోటీసులు పెట్టిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఎందుకు ఈడీ నోటీసులు ఇవ్వడం లేదు? అని మధుయాష్కీ ప్రశ్నించారు. 

Updated Date - 2022-07-22T22:17:00+05:30 IST