మోదీ బర్త్ డే... ఒకే రోజు 32 లక్షల మందికి వ్యాక్సిన్స్

ABN , First Publish Date - 2021-09-15T03:02:39+05:30 IST

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం భారీ ఏర్పాట్లకు తెర తీసింది. ముఖ్యంగా, మోదీ బర్త్ డే సందర్భంగా రికార్డు స్థాయిలో టీకాలు వేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సంకల్పించింది.

మోదీ బర్త్  డే... ఒకే రోజు 32 లక్షల మందికి వ్యాక్సిన్స్

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం భారీ ఏర్పాట్లకు తెర తీసింది. ముఖ్యంగా, మోదీ బర్త్ డే సందర్భంగా రికార్డు స్థాయిలో టీకాలు వేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సంకల్పించింది. సెప్టెంబర్ 17 ఒక్క రోజే దాదాపు 33 లక్షల డోసులు పంపిణీ చేయనున్నారు. గతంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనే ఒకే రోజు 28.50 లక్షలు వ్యాక్సిన్లు వేశారు. కాగా ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ జన్మదినం సందర్భంగా 32.90 లక్షల టీకాలు వేయనున్నారు. అంతే కాదు, సెప్టెంబర్ 26 కల్లా మధ్యప్రదేశ్ లోని అర్హులందరికీ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ ప్రక్రియనైనా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల 20 లక్షల మందికిపైగా రాష్ట్రంలో టీకాలు తీసుకున్నారు.  



Updated Date - 2021-09-15T03:02:39+05:30 IST