దుష్టశక్తులను తరిమేస్తానని చెప్పి బాలికపై కామాంధుడి అత్యాచారం
ABN , First Publish Date - 2022-04-04T18:41:54+05:30 IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ పండ్ల వ్యాపారి ఇంటి నుంచి దుష్టశక్తులను తరిమికొడతానని చెప్పి ఓ మైనర్ బాలికపై 6 నెలల పాటు అత్యాచారం...
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ పండ్ల వ్యాపారి ఇంటి నుంచి దుష్టశక్తులను తరిమికొడతానని చెప్పి ఓ మైనర్ బాలికపై 6 నెలల పాటు అత్యాచారం చేశాడు.భోపాల్లోని హబీబ్గంజ్కు చెందిన 30 ఏళ్ల పండ్ల విక్రయదారుడు నిహాల్ బేగ్ ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు బాలిక ఇంటికి వచ్చినప్పుడు ఆమె కుటుంబ సభ్యులను నమ్మించి అదృష్టాన్ని తెస్తానని చెప్పి బాలికపై మొదట అత్యాచారం చేశాడు.బాధితురాలి తండ్రి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వ్యాపారవేత్త. ఆమె తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా కొవిడ్ లాక్డౌన్ సమయంలో బాలిక తండ్రికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.‘‘వారి దురదృష్టం వెనుక ఒక దుష్టాత్మ ఉందని, దానిని పారదోలాల్సిన అవసరం ఉందని, దీని కోసం ప్రత్యేక ప్రార్థనలు అవసరం’’ అని నిహాల్ బేగ్ బాలిక తల్లిదండ్రులను ఒప్పించాడు.
నిందితుడు వారానికి రెండుసార్లు బాధితురాలి ఇంటికి వచ్చేవాడు. ఆచారాల సమయంలో ప్రత్యేక గదుల్లో ఉండాలని కుటుంబ సభ్యులందరినీ నమ్మించాడు. మొదటిసారి నిందితుడు బాలికను భయపెట్టాడు. బాలిక తనతో శారీరకంగా కలవటానికి అనుమతించకపోతే ఆత్మ ఆమె తల్లిదండ్రులను చంపేస్తుందని అని చెప్పాడు.ఆ బాలిక ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.నిందితుడు బేగ్ ను అరెస్టు చేసి అతనిపై పోక్సో చట్టం,భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.