నేటి నుంచి ‘మద్రాస్ డే’ కళా ప్రదర్శనలు
ABN , First Publish Date - 2022-08-20T15:55:40+05:30 IST
మద్రాస్ డే’ సందర్భంగా నగరంలో కళా ప్రదర్శనలు, వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 19: ‘మద్రాస్ డే’ సందర్భంగా నగరంలో కళా ప్రదర్శనలు, వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ప్రకటించింది. ఈ మేరకు జీసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక బీసెంట్ నగర్(Besant Nagar) ఎల్డామ్స్ బీచ్ సర్వీసు రోడ్డులో మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు గ్రామీణ నృత్యాలు, జానపద నృత్యాలు సహా పలు కళా ప్రదర్శనలుంటాయి. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించనున్నారు. ప్రజలు ఉచితంగా ఈ ప్రదర్శనలు వీక్షించవచ్చు. ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నారు.