మద్య నిషేధం అమలులో జగన్‌ విఫలం

ABN , First Publish Date - 2022-08-08T02:39:53+05:30 IST

మద్య నిషేధం అమలులో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని కందుకూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య

మద్య నిషేధం అమలులో జగన్‌ విఫలం
కందుకూరులో నిరసన తెలుపుతున్న తెలుగు మహిళలు

తెలుగు మహిళల నిరసన

కందుకూరు, ఆగస్టు 7:  మద్య నిషేధం అమలులో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని కందుకూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య విమర్శించారు. మద్యనిషేధం అమలుచేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కందుకూరులో ఆదివారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో నిరసన  చేపట్టారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం అక్కడ కల్తీ లిక్కర్‌ సీసాలను పగులగొట్టి మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సౌభాగ్య మాట్లాడుతూ ఆడబిడ్డలను మోసం చేసిన జగన్‌ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జగన్‌ అధికార పీఠం ఎక్కాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుమహిళా రాష్ట్ర నాయకులు శైలజారెడ్డి, విజయతోపాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల తెలుగు మహిళా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T02:39:53+05:30 IST