భక్తిశ్రద్థలతో మాఘ పూర్ణిమ

ABN , First Publish Date - 2021-02-28T04:09:00+05:30 IST

జిల్లాలో అన్ని వైష్ణవ, అమ్మవారి ఆలయాల్లో శనివారం మాఘ పూర్ణిమ వేడుకల్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తిశ్రద్థలతో మాఘ పూర్ణిమ
గరుడసేవలో రంగనాఽథుడు

నెల్లూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి 27 :  జిల్లాలో అన్ని వైష్ణవ, అమ్మవారి ఆలయాల్లో శనివారం మాఘ పూర్ణిమ వేడుకల్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రాతఃకాలంలో నదీ, సముద్ర స్నానాలు చేసి తమ ఇష్టదైవాలను పూజించారు. ఉపవాసాలు, దానధర్మాలు చేశారు. నగరంలోని తల్పగిరి రంగనాఽథస్వామి ఆలయంలో ఉదయం తిరుమంజనం సేవలు జరిగాయి. రాత్రి గరుడ సేవ ఉత్సవం జరిగింది. ఈ వేడుకల్లో ఆలయ చైౖర్మన్‌ కోట గురుబ్రహ్మం, ధర్మకర్తలు, ఈవో డి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నవాబుపేట ఉడయవర్లు దేవస్థానంలో మాఘపౌర్ణమి పూజలు జరిగాయి. నిత్యహోమాలు, విశేషపూజలు జరిగాయి. ఉదయం స్వామికి మోహినీ అలంకారం కనుల పండువగా జరిగింది. సాయంత్రం సహస్రదీపాల అలంకరణ, ఊంజల్‌ సేవలు జరిగాయి. రాత్రి గరుడ సేవలో స్వామికి నగరోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దాతలు,  ఈవో సహాయ కమిషనర్‌ శ్రీనివాసులురెడ్డి, వంశపార్యంపర్య ధర్మకర్త, చైర్మన్‌ పల్లాప్రోలు రామకృష్ణమాచార్యులు పర్యవేక్షించారు. మూలాపేట శంకరమఠంలో నవచండీహోమం, విశేషపూజలు జరిగాయి. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో చండీహోమం, విశేషపూజలు ఘనంగా జరిగాయి. భక్తులు, ధర్మకర్తలు ఉభయకర్తలు పాల్గొన్నారు. మహాత్మాగాంధీనగర్‌ కృష్ణమందిరంలో సత్యనారాయణ వ్రతం కనుల పండువగా జరిగింది. అన్నదానం జరిగింది.  కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T04:09:00+05:30 IST