anointing: మహా మారియమ్మన్కు 10,008 పాల కలశాలతో అభిషేకం
ABN , First Publish Date - 2022-08-06T13:13:23+05:30 IST
నామక్కల్లోని మహా మారియమ్మన్(Maha Mariamman) ఆలయంలో 10,008 పాల కలశాలతో క్షీరాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది.
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 5: నామక్కల్లోని మహా మారియమ్మన్(Maha Mariamman) ఆలయంలో 10,008 పాల కలశాలతో క్షీరాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. పరమత్తివేలూరు సమీపం మహా మారియమ్మన్ ఆలయంలో ప్రతి ఏడాది ఆడి మాసం మూడవ శుక్రవారం 10,008 పాల కలశాల అభిషేకం, 1,008 మంది మహిళలు హారతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అదే క్రమంలో, ఈ ఏడాది శుక్రవారం జరిగిన పూజల్లో 10,008 పాల కలశాలతో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి క్షీరాభిషేకం(Breastfeeding) చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో 1,008 మంది మహిళలు హారతులు వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.