Maharashtra తర్వాతి CM ఎన్సీపీ నుంచేనట!
ABN , First Publish Date - 2022-06-06T01:50:13+05:30 IST
సామాజిక న్యాయ శాఖ రేపు ఎవరికి ఇస్తారనే ప్రశ్న తలెత్తొచ్చు. ఈ ప్రశ్న ఇది వరకు కూడా వచ్చింది. కానీ ఆ శాఖ మా(ఎన్సీపీ) వద్ద మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి(ఉద్ధవ్ థాకరే) చెప్పారు. ఎందుకంటే అత్యుత్తమంగా పని చేసి ఆ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాం. అలాగే తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న రావొచ్చు. అది కూడా మేమే(ఎన్సీపీ) అవుతుంది..
ముంబై: మహారాష్ట్ర(Maharashtra)కు తర్వాతి కాబోయే ముఖ్యమంత్రి(chief minister) శరద్ పవార్(Sharad Pawar) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Nationalist Congress Party) నుంచేనని ఆ పార్టీ నేత, మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే(Dhananjay Munde) అన్నారు. శనివారం రాష్ట్రంలోని పర్బానిలో ఏర్పాటు చేసిన ఓ కర్యాక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కేటాయించిన సామాజిక న్యాయ శాఖలో తాను ఉత్తమంగా పని చేయడం వల్లే ఆ శాఖకు మంచి పేరు వచ్చిందని, అలాగే ప్రతిపక్ష నేతగా తాను ప్రభుత్వాన్ని గడగడలాయించానని ఆయన అన్నారు.
‘‘సామాజిక న్యాయ శాఖ రేపు ఎవరికి ఇస్తారనే ప్రశ్న తలెత్తొచ్చు. ఈ ప్రశ్న ఇది వరకు కూడా వచ్చింది. కానీ ఆ శాఖ మా(ఎన్సీపీ) వద్ద మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి(ఉద్ధవ్ థాకరే) చెప్పారు. ఎందుకంటే అత్యుత్తమంగా పని చేసి ఆ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాం. అలాగే తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న రావొచ్చు. అది కూడా మేమే(ఎన్సీపీ) అవుతుంది. ఆ పదవికి అత్యంత పేరు ప్రతిష్టలు మేము తీసుకురాగలం’’ అని ధనుంజయ్ అన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం ఏర్పడి గత నెలకు రెండున్నరేళ్లు పూర్తైంది. అంతకు ముందు ప్రభుత్వంలో ధనుంజయ్ ముండే ప్రతిపక్ష నేతగా ఉన్నారు.