రైతుల మహాపాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు

ABN , First Publish Date - 2021-10-31T01:51:00+05:30 IST

అమరావతి రైతులు సోమవారం నుంచి తలపెట్టనున్న ‘న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర’కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి మద్దతు తెలిపారు

రైతుల మహాపాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు

గుంటూరు: అమరావతి రైతులు సోమవారం నుంచి తలపెట్టనున్న  ‘న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర’కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి మద్దతు తెలిపారు. ఆమె సోమవారం పాదయాత్రకు హాజరవనున్నట్లు మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తెలిపారు. అలానే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు రైతులకు మద్దతు తెలిపారు. శనివారం ఆయన తుళ్లూరు శిబిరాన్ని సందర్శించారు. కాగా చింతలపూడికి చెందిన రావిపాటి ఉదయ్‌కుమార్‌, రైతుల పాదయాత్రకు తన వంతుగా రూ.2 లక్షల విరాళం అందించారు. ఆ  సొమ్మును అతని మిత్రులు చందన్‌బాబు, పమిడి కమలాకర్‌ ద్వారా రైతు నేతలకు అందించారు. 

Updated Date - 2021-10-31T01:51:00+05:30 IST