జన సంద్రం.. మహానాడు ప్రాంగణం
ABN , First Publish Date - 2022-05-28T22:02:03+05:30 IST
అమరావతి: మహానాడు ప్రాంగణం జన సందోహంగా మారింది. ప్రాంగణం ఎదురుగా ఉన్న జాతీయ రహదారితోపాటు ఇతర రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్కు
అమరావతి: మహానాడు ప్రాంగణం జన సందోహంగా మారింది. ప్రాంగణం ఎదురుగా ఉన్న జాతీయ రహదారితోపాటు ఇతర రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న కారు టైర్లలో గాలిని పోలీసులు తీసేస్తున్నారు. ఇటు మహానాడుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బయల్దేరారు. కారులో నుంచి ఆయన కార్యకర్తలకు అభివాదం చేస్తూ పెద్ద కాన్వాయ్తో ముందుకు సాగారు. లోకేష్తో పాటు పలువురు నేతలు మహానాడుకు బయల్దేరారు. మహానాడుకు తరలివస్తున్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటామంటున్నారు టీడీపీ అభిమానులు. జనం పెరిగిపోతుండడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే సభను ప్రారంభించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది.