మహబూబాబాద్లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
ABN , First Publish Date - 2020-08-08T18:11:44+05:30 IST
జిల్లాలోని కేసముద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలగల బోయిన వెంకన్న యాదవ్ దారుణ హత్యకు గురయ్యాడు.
మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలగల బోయిన వెంకన్న యాదవ్ దారుణ హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో వెంకన్నను ప్రత్యర్ధులు హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.