కాళీమాతకు పూజల పేరుతో 20 దున్నలు బలి

ABN , First Publish Date - 2022-04-19T15:00:52+05:30 IST

జిల్లాలోని మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపరిధిలోని జెండాల తండాలో దారుణం జరిగింది.

కాళీమాతకు పూజల పేరుతో 20 దున్నలు బలి

మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపరిధిలోని జెండాల తండాలో దారుణం జరిగింది. కాళీమాతకు పూజల పేరుతో తండావాసులు దాదాపు 20 దున్నలను బలిచ్చారు. దున్నల తలలు తెగిపడేలా భయంకరంగా నరికేశారు. అత్యంత పాశవికంగా దున్నల తలలు నరకడంపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. దున్నల తలలు నరకే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2022-04-19T15:00:52+05:30 IST