మహబూబాబాద్లో రైతు దారుణ హత్య
ABN , First Publish Date - 2022-03-22T13:27:57+05:30 IST
జిల్లాలోని కొత్తగూడ మండలం కార్లాయి అటవీప్రాంతంలో చందుమల్లయ్య అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు.
మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం కార్లాయి అటవీప్రాంతంలో చందుమల్లయ్య అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం పశువుల మేపేందుకు అడవికి వెళ్లిన మల్లయ్య తిరిగిరాలేదు. నిందితుడు గుగులోతు బిక్కు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్యకు గల కారణాలను పోలీసులు సేకరిస్తున్నారు.