Mahabubabad: విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-06-21T18:20:44+05:30 IST

జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది.

Mahabubabad: విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అందనాలపాడులోని రామాలయం గుడికి సౌండ్ మైకులు కడుతుండగా విద్యుత్ షాక్ తగలింది. మైకులు కట్టె పైపు ఇనుపది కావడం వలనే విద్యుత్ షాక్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులు సుబ్బరావు(67), మస్తాన్ రావు(57), వెంకయ్య (55)గా తెలుస్తోంది. ముగ్గురు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మైకులు కట్టే సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తీగలు కిందపడి ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-21T18:20:44+05:30 IST