మహానాడును విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-26T06:16:32+05:30 IST

మహానాడును విజయవంతం చేయాలని రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తక్‌ అహ్మద్‌ అన్నారు.

మహానాడును విజయవంతం చేయాలి

పొదిలి రూరల్‌, మే 25 :  మహానాడును విజయవంతం చేయాలని రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తక్‌ అహ్మద్‌ అన్నారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు  వెళ్తూ పొదిలిలో బుధవారం పార్టీ కార్యాల యంలో జిల్లా ముస్లిం మైనారిటీ సెల్‌ అధ్య క్షుడి ఆధ్వర్యంలో కొద్దిసేపు కార్యకర్తలతో మా ట్లాడారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమని ఎవరూ అధైర్యపడవద్దన్నారు.   మహానాడు విజయ వంతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు. మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకునేం దుకు వైసీపీ పాలకులు, అధికారులు ప్రయ త్నాలను తిప్పికొడుతూ తరలిరావాలన్నారు. శుక్రవారం మహానాడులో పాల్గొనే ముస్లింలు నమాజ్‌కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.   ముస్లింలు తలపాగా (టోపీ)తో రావాలని అహ్మద్‌ సూచించారు.


Updated Date - 2022-05-26T06:16:32+05:30 IST