మహానాడు అద్భుత విజయాన్ని సాధించింది

ABN , First Publish Date - 2022-05-29T07:54:35+05:30 IST

మహానాడు అద్భుత విజయాన్ని సాధించింది

మహానాడు అద్భుత విజయాన్ని సాధించింది

లక్షలాదిగా వచ్చారు... ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా చేశారు:పయ్యావుల

అమరావతి, మే28(ఆంధ్రజ్యోతి): ‘మహానాడు అద్భుత విజయాన్ని సాధించింది. ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. వాటిని అధిగమించి... నడుచుకుంటూ, ట్రాక్టర్లు ఎక్కి, వివిధ ప్రత్యామ్నాయాల్లో లక్షలాదిగా తరలివచ్చారు. ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా చేశారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. దీంతో అధికార పార్టీకి మైండ్‌ బ్లాంక్‌ అయింది’’ అని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. మహానాడు తర్వాత ఆయన ఓ వీడియో ప్రకటన చేశారు. ‘ప్రభుత్వ పెద్దలు, పాలకులకు చెంపపెట్టులా మహానాడు సాగింది. అధికార మత్తులో ఊగుతున్న వైసీపీ ప్రభుత్వానికి మనుగడ లేదు. మారడానికి, మార్చుకోవడానికి శక్తిలేదు. అణగారిన ప్రజానీకం, మోసపోయిన రైతులు, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, ధరలతో ఇబ్బంది పడ్డ సామాన్యులందరూ.. రాష్ట్రాన్ని కాపాడటానికి చంద్రబాబు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. యువత, మహిళ, బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత పెంచే లా లోకేశ్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. యువతసహా 22 కులాల నాయకులు మహానాడులో ప్రసంగించారు’ అని కేశవ్‌ చెప్పారు.

Updated Date - 2022-05-29T07:54:35+05:30 IST