మహానందిలో పరోక్షంగా రుద్రాభిషేకం
ABN , First Publish Date - 2021-05-09T05:32:31+05:30 IST
మహానంది క్షేత్రంలో పరోక్ష సేవల్లో భాగంగా శనివారం మహానందీశ్వరుడికి, ఏకాంతంగా ఆలయ వేదపండితులు, అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు.
మహానంది, మే 8: మహానంది క్షేత్రంలో పరోక్ష సేవల్లో భాగంగా శనివారం మహానందీశ్వరుడికి, ఏకాంతంగా ఆలయ వేదపండితులు, అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మలతోపాటు అర్చకులు జనార్దన్శర్మ, మణికంఠశర్మ ప్రత్యేక రుధ్రాక్ష మంటపంలో స్వామివారి ప్రతి రూపాన్ని ఆశీనులు గావించారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు.