
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో డిసెంబర్ 12న ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ 12న జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సభను విజయవంతం చేసి ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలపోస్తోంది.