మహాపాదయాత్రను ఆదరించాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-11-02T01:53:22+05:30 IST
రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రను అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరించాలని సీపీఎం
విజయవాడ: రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రను అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు రైతుల మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించాయన్నారు. జగన్ ఆనాడు రాజధానికి అనుకూలంగా మాట్లాడారని, 30వేల ఎకరాలు భూమి అవసరమని వ్యాఖ్యానించారని చెప్పారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రకటన చేశారన్నారు. ప్రస్తుతం ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో బీజేపీ అవలంభిస్తున్న ద్వంద్వ విధానాలను విడనాడాలని రామకృష్ణ సూచించారు.