రేపటితో ముగియనున్న అమరావతి రైతుల పాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-13T17:15:32+05:30 IST

అమరావతి రైతుల మహాపాదయాత్ర మంగళవారంతో ముగియనుంది.

రేపటితో ముగియనున్న అమరావతి రైతుల పాదయాత్ర

చిత్తూరు: అమరావతి రైతుల మహాపాదయాత్ర మంగళవారంతో ముగియనుంది. నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ నెల 17న తిరుపతిలో పాదయాత్ర ముగింపు బహిరంగ సభ కోసం రైతులు ప్రయత్నిస్తున్నారు.  అయితే బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో సభకు అనుమతి కోసం రైతులు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు.


అలిపిరి చేరుకున్న రైతులు మంగళవారం శ్రీవారిని సామూహికంగా దర్శించుకోనున్నారు. ఇందు కోసం టీటీడీకి లేఖ రాశారు. దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదు. దాంతో సామూహిక దర్శనంపై సందిగ్ధత నెలకొంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న సంకల్పంతో రైతులు నవంబర్ 1న మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. నాలుగు జిల్లాల మీదుగా దాదాపు 5 వందల కి.మీ. పాదయాత్ర సాగింది. పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు.

Updated Date - 2021-12-13T17:15:32+05:30 IST