Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే ట్వీట్.. ‘‘మమ్మల్ని బయపెట్టలేరు.. ఎందుకంటే’..

ABN , First Publish Date - 2022-06-24T05:30:54+05:30 IST

Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే ట్వీట్.. ‘‘మమ్మల్ని బయపెట్టలేరు.. ఎందుకంటే’..

Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే ట్వీట్.. ‘‘మమ్మల్ని బయపెట్టలేరు.. ఎందుకంటే’..

ముంబై: మహావికాస్‌ అఘాడీ ఒక అసహజమైన కూటమని, శివసేన తన కోసం, తన పార్టీ కార్యకర్తల కోసం ఆ కూటమి నుంచి బయటకు రావడం తప్పనిసరని వ్యాఖ్యలు చేసి ఆ దిశగా అడుగులేస్తున్న ఏక్‌నాథ్ షిండే తాజాగా మరో ట్వీట్ చేశారు. 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని తమను బయపెట్టలేరని, ఎందుకంటే తామంతా శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే అనుచరులమని ఆయన ట్వీట్ చేశారు. తమకు చట్టం తెలుసని, కాబట్టి ఈ బెదిరింపులను తాము పట్టించుకోమని ట్వీట్‌లో ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. ఈ కూటమి వల్ల కాంగ్రెస్‌, ఎన్సీపీకే లాభం చేకూరిందని.. ఆ రెండు పార్టీలూ బలపడుతుండగా శివసేన వ్యవస్థాగతంగా బలహీనపడుతూ వచ్చిందని, గత రెండున్నరేళ్లుగా సగటు శివసైనికులు ఎన్నో బాధలు పడ్డారని షిండే ఆవేదన వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-06-24T05:30:54+05:30 IST