ఒకే వేదికపై పవార్, ఆదిత్య థాకరే

ABN , First Publish Date - 2021-01-25T15:43:45+05:30 IST

ముంబై వేదికగా జరిగే రైతు నిరసన కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మంత్రి ఆదిత్య థాక్రే పాల్గొనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన

ఒకే వేదికపై పవార్, ఆదిత్య థాకరే

ముంబై : ముంబై వేదికగా జరిగే రైతు నిరసన కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మంత్రి ఆదిత్య థాక్రే పాల్గొననున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆలిండియా కిసాన్ సభ నేతృత్వంలో నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సోమవారానికి ఆ పాదయాత్ర ముంబై చేరుకుంటుంది. ఈ సందర్భంగా జరిగే ర్యాలీలో పవార్, ఆదిత్య థాకరే పాల్గొననున్నారు. అయితే సీఎం ఉద్ధవ్ మాత్రం పాల్గొనడం లేదు. ‘‘కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ పాల్గొనడం లేదు. ఆయన తరపున ఓ ప్రతినిధిని పంపుతున్నారు. అయితే మద్దతు మాత్రం ఉంటుంది.’’ అని శివసేన పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్ర నలుమూలాలా ఉన్న రైతులు ముంబైకి చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ర్యాలీ జరిగే ఆజాద్ మైదానం ప్రాంతంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ‘‘18 నెలల పాటు చట్టాలను తాత్కాలికంగా నిలిపేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. చట్టాలను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు మద్దతిచ్చే వారందర్నీ ఏకం చేస్తామని రైతులు నాతో చెప్పారు. ర్యాలీకి నన్ను ఆహ్వానించారు. నేను సరే అన్నాను.’’ అని పవార్ ప్రకటించారు. 

Updated Date - 2021-01-25T15:43:45+05:30 IST