తెలంగాణలో ఆలయాలకు మహర్దశ
ABN , First Publish Date - 2022-05-28T07:01:38+05:30 IST
తెలంగాణ ప్రభుత్వంతోనే ఆలయాలకు మహర్దశ వ చ్చిందని అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
మామడ, మే 27 : తెలంగాణ ప్రభుత్వంతోనే ఆలయాలకు మహర్దశ వ చ్చిందని అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున మామడ మండలంలోని రాసిమెట్ల గ్రామంలో ఇటీవల నిర్మించిన భీమన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. భీమన్నస్వామికి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామస్థులు ఘనంగా స్వాగతం తెలిపారు. అనంతరం వాస్తపూర్ సర్పంచ్ సంతోష్ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవాలాల్ జగదాంబ ఆలయం లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ప్రతిగ్రామంలో ఆల యం నిర్మాణం వల్లనే ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్కిషన్రెడ్డి, గాయద్పల్లి సర్పంచ్ రాందాస్, టీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, రైతుసమితి మండల అధ్య క్షుడు గంగారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్రావు, కే. భాస్కర్, తది తరులు పాల్గొన్నారు.