పెడన ప్రముఖుడు మహేశ్వరరావు మృతి

ABN , First Publish Date - 2022-07-07T05:51:58+05:30 IST

పుర ప్రముఖుడు, పెడన మునిసిపల్‌ మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు మెట్ల మహేశ్వరరావు బుధవారం ఉదయం మృతి చెందాడు.

పెడన ప్రముఖుడు మహేశ్వరరావు మృతి

 పెడన : పుర ప్రముఖుడు, పెడన మునిసిపల్‌ మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు మెట్ల మహేశ్వరరావు బుధవారం ఉదయం మృతి చెందాడు. భట్ట జ్ఞానకోటయ్య జడ్పీ హైస్కూల్‌ పూర్వ విద్యార్థి సంఘానికి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా వ్యవహరించిన మహేశ్వరరావు పాఠశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ప్రతియేటా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. పలువురు ప్రముఖులు పోలవరపుపేటలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. 

Updated Date - 2022-07-07T05:51:58+05:30 IST