బీజేపీ తెలంగాణ కార్యాలయంలో మహిళా మోర్చా వర్క్షాప్
ABN , First Publish Date - 2021-07-31T21:37:08+05:30 IST
బీజేపీ కార్యాలయంలో జాతీయ మహిళా మోర్చా సోషల్ మీడియా వర్క్ షాప్ సోమవారం నిర్వహించారు. ఈ వర్క్ షాప్ సాయంత్రం వరకు జరగనుంది.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ కార్యాలయంలో జాతీయ మహిళా మోర్చా సోషల్ మీడియా వర్క్ షాప్ను శనివారం నిర్వహించారు. ఈ వర్క్షాప్ సాయంత్రం వరకు జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ, అన్ని రాష్ట్రాల మహిళా మోర్చా ప్రతినిధులు, పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతినిధులు మీడియా, సోషల్ మీడియాపై మహిళా మోర్చా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ బలోపేతానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.