హైదరాబాద్కు మహీంద్రా మెడికల్ కాలేజీ
ABN , First Publish Date - 2022-03-04T17:22:21+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా మరో ప్రైవేటు మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్లో భారతీయ వైద్య విద్యార్థుల ఇబ్బందులపై స్పందిస్తూ.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ మేరకు ప్రకటన చేశారు. సుమారు 18వేల మంది భారతీయ
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో ప్రైవేటు మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్లో భారతీయ వైద్య విద్యార్థుల ఇబ్బందులపై స్పందిస్తూ.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ మేరకు ప్రకటన చేశారు. సుమారు 18వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. వైద్య విద్య కోసం భారత్ నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారంటూ వచ్చిన కథనంపై ఆనంద్ మహీంద్రా గురువారం ట్విటర్ ద్వారా స్పందించారు. దేశంలో వైద్య కళాశాలల కొరత గురించి తనకు తెలియదని పేర్కొంటూ.. హైదరాబాద్ బహదూర్పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీ క్యాంప్సలో మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన సీపీ గుర్నానీ.. వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై వచ్చే సోమవారం నివేదిక సమర్పిస్తామన్నారు.