స్క్రాప్ గోదాం ఘటనపై అధికారులతో విశ్లేషిస్తున్నాం: మహమూద్ అలీ

ABN , First Publish Date - 2022-03-23T17:25:22+05:30 IST

ప్లాస్టిక్ గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు.

స్క్రాప్ గోదాం ఘటనపై అధికారులతో విశ్లేషిస్తున్నాం: మహమూద్ అలీ

హైదరాబాద్: సికింద్రాబాద్‎, బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్క్రాప్ గోదాం ఘటనపై అధికారులతో విశ్లేషిస్తున్నామన్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమవుతామని, హైదరాబాదులో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయో, ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ భేటీలో చర్చిస్తామన్నారు. ఇరుకు సందుల్లో, నివాసం ప్రాంతాల్లో ఇలాంటి స్క్రాప్ గోదాంలు హైదరాబాదులో చాలా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఓనర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్‌కు తరలిస్తామన్నారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తేపియజేస్తున్నానని హోంమంత్రి ప్రకటించారు.

Updated Date - 2022-03-23T17:25:22+05:30 IST