వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు... అమెరికా దిగ్గజ కంపెనీలపై ప్రభావం...
ABN , First Publish Date - 2021-05-07T22:43:29+05:30 IST
భారత్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2.14 కోట్లకు పైగా కేసులు నమోదు కాగా, 2.34 లక్షల మరణాలు సంభవించాయి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఇక భారత ఐటీ నగరం బెంగళూరు ఇటీవల వెలవెలబోతోంది.
బెంగళూరు : భారత్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2.14 కోట్లకు పైగా కేసులు నమోదు కాగా, 2.34 లక్షల మరణాలు సంభవించాయి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఇక భారత ఐటీ నగరం బెంగళూరు ఇటీవల వెలవెలబోతోంది.
కార్యాలయాల మూత...
కరోనాకు ముందు కళకళలాడిన బెంగళూరు ఇప్పుడు వెలవెలబోతోంది. గోల్డ్మన్ శాక్స్ గ్రూప్ ఇంక్, యూబీఎస్ గ్రూప్ ఏజీ వంటి దిగ్గజాలు రిస్క్ మేనేజ్మెంట్ మొదలుకుని కస్టమర్ సర్వీసెస్, కాంప్లయెన్స్ వరకు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మాత్రం బెంగళూరులో చాలా భవనాలు ఖాళీగా ఉన్నాయి. దశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతున్న క్రమంలో వాల్ స్ట్రీట్ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు నెలల తరబడి వర్క్ ఫ్రమ్ హోంకు పరిమితమయ్యాయి. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలంపాటు కొనుసాగుతుందన్నది ఇదమిద్ధంగా తెలియడంలేదు.