నాణ్యమైన పనులు నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-05-19T05:45:33+05:30 IST
ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ యధుభూషణ్రెడ్డి పేర్కొన్నారు.
ఉపాధి హామీ పీడీ
దువ్వూరు, మే 18: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ యధుభూషణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చల్లబసాయిపల్లె గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేజ్పార్కు, సచివాలయం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, పండ్ల తోటల పెంపకం, సీసీ రోడ్డును పరిశీలించారు. కూలీలకు సరైన వేతనం పడేలా ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రామచంద్రారెడ్డి, ఈసీ విజయకుమార్, పీఏలు, ఎఫ్ఏలు, గ్రామ మాజీ సర్పంచ్ సంగన లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.