‘రైతు కోసం తెలుగుదేశం’ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2021-09-17T14:05:00+05:30 IST

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు..

‘రైతు కోసం తెలుగుదేశం’ను జయప్రదం చేయండి

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు


వేమూరు: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శనివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు గురువారం విలేకర్లకు తెలిపారు. ఉదయం 11 గంటలకు వేమూరు ఎన్టీఆర్‌ పురవేదిక వద్ద నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. రైతాంగ సమస్యలపై మండల వ్యవసాయ శాఖ అధి కారికి వినతిపత్రం అందించి నిరసన తెలియజేస్తామన్నారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-09-17T14:05:00+05:30 IST