ధర్నాను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-07-28T04:52:49+05:30 IST
ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బుకారిబాబు డిమాండ్ చేశారు.
దాసన్నపేట: ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బుకారిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పూల్బాగ్లోని మోడల్ స్కూల్లో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 29న విజయనగరంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు , ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు హెల్త్కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకున్న సందర్భంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా విద్యాశాఖలో తీసుకోవాలన్నారు. అనంతరం కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల సిబ్బందిని కలిసి ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీటీఎఫ్ ప్రతినిధులు పి.శ్రీనివాస్, మర్రాపు శ్రీనివాసరావు ఉన్నారు.