ఈ నెల 15న చలో ఢిల్లీ

ABN , First Publish Date - 2021-12-02T05:59:10+05:30 IST

హలో మాల.. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ కోరారు.

ఈ నెల 15న చలో ఢిల్లీ
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌ కుమార్‌, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌ తదితరులు

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌

నరసరావుపేట టౌన్‌, డిసెంబరు1: హలో మాల.. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎన్జీవో హోంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ జంతర్‌ మంతర్‌ వద్ద ఈనెల 15 నుంచి 18 వరకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన ఎక్కడ ఉన్నా మాలలు అడ్డుకుంటామని అన్నారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పిల్లి మేరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లెల అనిల, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దారా హేమాప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి రాయపూడి కోటిస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు సాతులూరి బసవయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-02T05:59:10+05:30 IST