రెస్టారెంట్‌లో Fish Curry తింటూ అది గమనించి ఓ మహిళ షాక్.. ఆ తర్వాత సిబ్బంది రెస్పాన్స్‌కు ఆమె మైండ్ బ్లాక్!

ABN , First Publish Date - 2022-07-03T19:25:30+05:30 IST

రెస్టారెంట్ ఫుడ్‌ను టేస్ట్ చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన ఫుడ్‌లో..ఇనుప వస్తువు కనిపించడంతో కంగుతింది. ఆ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బందికి తెలియజేయగా.. వాళ్ల నుంచి ఊహించని

రెస్టారెంట్‌లో Fish Curry తింటూ అది గమనించి ఓ మహిళ షాక్.. ఆ తర్వాత సిబ్బంది రెస్పాన్స్‌కు ఆమె మైండ్ బ్లాక్!

ఇంటర్నెట్ డెస్క్: రెస్టారెంట్ ఫుడ్‌ను టేస్ట్ చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన ఫుడ్‌లో..ఇనుప వస్తువు కనిపించడంతో కంగుతింది. ఆ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బందికి తెలియజేయగా.. వాళ్ల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఆమె మైండ్ బ్లాక్ అయింది. దీంతో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


వారం రోజులపాటు పని ఒత్తిడిని భరించిన మలేషియాకు చెందిన ఓ మహిళ.. వీకెండ్‌లో సరదాగా కాలక్షేపం చేసి రిలీఫ్ కావాలని భావించింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌ను విజిట్ చేసింది. అనంతరం Fish Curry‌తో కూడిన  భోజనాన్ని ఆమె ఆర్డర్ చేసింది. కొద్ది సమయం తర్వాత సిబ్బంది తీసుకొచ్చిన ఫుడ్‌ను తినడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చేప తల తింటుండగా అందులో ఆమె ఇనుముతో చేసిన గాలం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా ఆమె కంగుతింది. వెంటనే సిబ్బందిని పిలిచి విషయం చెప్పింది.



అయితే వాళ్లు దాన్ని లైట్ తీసుకోవడంతో వాదనకు దిగింది. దీంతో రెస్టారెంట్ మేనేజర్ కలజేసుకున్నాడు. ఆమెకు జరిగిన చేదు అనుభవానికి క్షమాణ చెప్పి, బిల్లులో డిస్కౌంట్ ఇస్తామనడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే చివరకు బిల్ అందుకున్న ఆమె.. అందులో రెస్టారెంట్ తనకు ఇచ్చిన డిస్కౌంట్ చూసి బిత్తరబోయింది. తనకు కలిగిన అసౌకర్యానికి రెస్టారెంట్ సిబ్బంది.. కేవలం ఒక్క రూపాయికి సమానమైన  డిస్కౌంట్ ఇవ్వడంతో షాకైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. ఆ బిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 


Updated Date - 2022-07-03T19:25:30+05:30 IST