గృహిణి మిస్సింగ్.. మల్కాజ్‌గిరి పీఎస్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-26T18:42:26+05:30 IST

మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.

గృహిణి మిస్సింగ్.. మల్కాజ్‌గిరి పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్: మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. స్థానికంగా నివాసం ఉంటున్న సముద్రాల గీతా రాణి(45) కనుపడుట లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో మాట్లాడగలదని తెలిపారు. ఆమె ఎత్తు ఐదు అడుగులు కాగా, కనపడకుండా పోయిన రోజు చీర ధరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఎక్కడైనా కనపడితే తమకు సమాచారం అందించగలరని మల్కాజిగిరి పోలీసులు ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-02-26T18:42:26+05:30 IST