మల్లన్న హుండీ రాబడి రూ.60,19,628

ABN , First Publish Date - 2021-06-17T05:49:21+05:30 IST

శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.

మల్లన్న హుండీ రాబడి రూ.60,19,628
హుండీ నగదు లెక్కిస్తున్న దేవస్థానం సిబ్బంది

శ్రీశైలం, జూన్‌ 16: శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. నగదు రూపేణా రూ. 60,19,628 లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 61 రోజులలో సమర్పించారు. 82 గ్రాముల బంగారం, 940 గ్రాములు వెండి కూడా లభించాయి. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 

Updated Date - 2021-06-17T05:49:21+05:30 IST