భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం

ABN , First Publish Date - 2022-06-27T06:35:17+05:30 IST

భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది.

భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం
చందర్‌కు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న అర్చకులు

- మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే చందర్‌

ఓదెల, జూన్‌ 26: భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది.  స్వామివారిని టీఆర్‌ఎస్‌  జిల్లా అధ్యక్షుడు, రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకోని అభిషే కాన్ని నిర్వహించారు. అలాగే రామాలయాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. అనంతరం ఆలయ సిబ్బంది కోరుకంటి చందర్‌ను సన్మానించి ఆలయ జ్ఞాపికను అందజేశారు. సుదూరి ప్రాంతాల నుంచి వాహనాల్లో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 

Updated Date - 2022-06-27T06:35:17+05:30 IST