మల్లన్నసాగర్‌ గుంతలో పడి ఒకరి గల్లంతు?

ABN , First Publish Date - 2021-02-28T05:26:21+05:30 IST

మండలంలోని పల్లెపహాడ్‌- సింగారం శివారులో మల్లన్నసాగర్‌ కట్ట కోసం తీసిన గుంతలో శుక్రవారం సాయంత్రం వేములఘాట్‌ గ్రామానికి చెందిన శేరుపల్లి మల్లారెడ్డి (35) గల్లంతయినట్లు గ్రామస్థులు తెలిపారు.

మల్లన్నసాగర్‌ గుంతలో పడి ఒకరి గల్లంతు?

తొగుట, ఫిబ్రవరి 27 : మండలంలోని పల్లెపహాడ్‌- సింగారం శివారులో మల్లన్నసాగర్‌ కట్ట కోసం తీసిన గుంతలో శుక్రవారం సాయంత్రం వేములఘాట్‌ గ్రామానికి చెందిన శేరుపల్లి మల్లారెడ్డి (35) గల్లంతయినట్లు గ్రామస్థులు తెలిపారు. రెండు రోజులుగా పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. శనివారం రాత్రి వరకు కూడా ఆచూకీ లభించలేదు. గుంత పక్కనే మల్లారెడ్డి ద్విచక్ర వాహనం, దుస్తులు ఉండడంతో అతడు గుంతలో పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి రైస్‌మిల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మల్లారెడ్డికి భార్య లావణ్య, ఇద్దరు కొడుకులు భరత్‌రెడ్డి, దుర్గారెడ్డి ఉన్నారు.


Updated Date - 2021-02-28T05:26:21+05:30 IST