వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-08-03T06:01:00+05:30 IST

స్థానిక మల్లారెడ్డినగర్‌ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా జరిగింది.

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం
మంగళసూత్రాలను భక్తులకు చూపుతున్న అర్చకులు

గుంటూరు (సాంస్కృతికం), ఆగస్టు 2: స్థానిక మల్లారెడ్డినగర్‌ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో దంపతులచే శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మెట్టుకృష్ణారెడ్డి, మున్నంగి సాంబిరెడ్డి, పి.సీతారామిరెడ్డి, కోనూరు నాగిరెడ్డి, మెట్టు బలరామిరెడ్డి, మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, దాట్ల వెంకటరెడ్డి దంపతులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-03T06:01:00+05:30 IST