మల్లికార్జునస్వామికి లక్ష బిల్వార్చన
ABN , First Publish Date - 2021-03-01T05:09:58+05:30 IST
దొమ్మేరుగ్రామంలోని భ్రమరాంభ సమేత ఉద్దండ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామికి లక్ష బిల్వార్చన నిర్వహిం చారు.
కొవ్వూరు ఫిబ్రవరి 28 : దొమ్మేరుగ్రామంలోని భ్రమరాంభ సమేత ఉద్దండ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామికి లక్ష బిల్వార్చన నిర్వహిం చారు. దొమ్మేరు బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శివకోటి మల్లికార్జున శర్మ, భాస్కరలక్ష్మి దంపతులు సహకారంతో ఆదివారం గణపతి పూజ, లక్ష బిల్వార్చన, రుద్రహోమం, భ్రమరాంబ దేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమం లో వైవీఎస్ కామేశ్వరరావు, వల్లూరి రవిబాబు, మేడూరి సతీశ్, సూరంపూడి శ్రీనివాస్, మేడూరి సుబ్రహ్మణ్యశర్మ, చిరవూరి సుబ్రహ్మణ్యం, మల్లాది కళ్యాణ్కుమార్, బలిజేపల్లి సూర్యప్రకాశరావు, చింతా మణికుమార్, గొర్తి సుబ్రహ్మణ్యం, గరిమెళ్ళ సత్యనారాయణశర్మ, భక్తులు పాల్గొన్నారు.