Kolkata Municipal Corporation ఎన్నికల్లో మెజార్టీ టీఎంసీ అభ్యర్థుల ఆధిక్యం
ABN , First Publish Date - 2021-12-21T15:32:21+05:30 IST
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కీలకమైన కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) ఎన్నికల ఫలితాల్లో...
కోల్కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కీలకమైన కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ లోని 144 వార్డుల్లో అధిక స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుంటుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మంగళవారం సాగుతున్న ఓట్ల లెక్కింపు పర్వంలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీఎంసీ 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ నాలుగు వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు రెండేసి వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. టీఎంసీ అత్యధిక వార్డుల్లో ముందుకు దూసుకుపోతుండటంతో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)లో టీఎంసీ పాలన రానుంది.