కర్ణాటకలో దారుణం...తల్లిని చంపిన తనయుడు

ABN , First Publish Date - 2020-11-16T18:37:48+05:30 IST

సభ్యసమాజం తలదించుకునేలా ఓ కుమారుడు కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన ...

కర్ణాటకలో దారుణం...తల్లిని చంపిన తనయుడు

బెంగళూరు : సభ్యసమాజం తలదించుకునేలా ఓ కుమారుడు కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలో వెలుగుచూసింది. హవేరి జిల్లా వనహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లిని బంధువుల ఇంటికి తీసుకువెళుతూ ఆమెపై అఘాయిత్యం చేసి చంపాడు. రెండేళ్ల క్రితం భర్త మరణించడంతో తల్లి ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకుందనే కోపంతో కుమారుడు తల్లిని హతమార్చాడు. తల్లికి మద్యం తాగించి, తాను మద్యం తాగి అఘాయిత్యం చేసి హతమార్చాడని పోలీసులు చెప్పారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2020-11-16T18:37:48+05:30 IST