సమస్యలు తీరుస్తానని చెప్పి మహిళలపై మాంత్రికుడి అత్యాచారం

ABN , First Publish Date - 2020-08-13T19:01:26+05:30 IST

సమస్యలు తీరుస్తానని చెప్పి ఓ మాంత్రికుడు ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిపిన ఘటన....

సమస్యలు తీరుస్తానని చెప్పి మహిళలపై మాంత్రికుడి అత్యాచారం

భోపాల్ (మధ్యప్రదేశ్): సమస్యలు తీరుస్తానని చెప్పి ఓ మాంత్రికుడు ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిపిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగాపూర్ జిల్లాలో వెలుగుచూసింది. ధర్మేంద్రదాస్ అలియాస్ ధర్మేంద్ర దూబే తనకు మంత్రాలు వచ్చని, తన మాయతో సమస్యలు తీరుస్తానని నమ్మించి ముగ్గురు మహిళలపై అత్యాచారం చేశాడు. మాంత్రికుడు మరో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించాడు. మాంత్రికుడికి పెళ్లి అయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ధర్మేంద్రదాస్ తన ఇంట్లోనే చిన్న దేవాలయం నిర్మించుకొని మంత్రాలతో సమస్యలు తీరుస్తానంటూ మహిళలపై అత్యాచారం చేశాడు. గంజాయి విక్రయిస్తూ గతంలో ధర్మేంద్ర దాస్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో బాధిత మహిళల ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలతో అశ్లీల వీడియోలు కూడా తీశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు అతని ఇంట్లో అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-08-13T19:01:26+05:30 IST