Speakerలో భక్తి గీతాలు ప్లే చేసినందుకు కొట్టిచంపారు
ABN , First Publish Date - 2022-05-06T22:05:49+05:30 IST
అహ్మదాబాద్ : Gujarath లోని మెహ్సనా జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తన ఇంటి ఆవరణలో ఉన్న చిన్న ఆలయం వద్ద భక్తి గీతాలను Speaker లో ప్లే చేశాడనే కార
అహ్మదాబాద్ : Gujarath లోని మెహ్సనా జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తన ఇంటి ఆవరణలో ఉన్న చిన్న ఆలయం వద్ద భక్తి గీతాలను Speaker లో ప్లే చేశాడనే కారణంతో 42 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు. మే 3న జరిగిన ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉంది. నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మెహ్సనా జిల్లాలోని ముదర్ధా గ్రామంలో ఈ ఘటన జరిగిందని లంగ్నజ్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఎస్బీ చవ్దా వెల్లడించారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో మరణించిన జశ్వంత్ థాకూర్తోపాటు ఆయన అన్నయ్య అజిత్పై కూడా కర్రలతో నిందితులు దాడి చేశారని చెప్పారు. అజిత్ తీవ్రగాయాల పాలయ్యాడన్నారు. తొలుత వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత దాడి కర్రలతో చేశారని ఎస్ఐ వివరించారు. మృతుడి అన్నయ్య అజిత్ ఇచ్చిన సమాచారం మేరకు మే 4న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు.
బాధిత కుటుంబం తమ ఇంటి ఆవరణలో చిన్న గుడి నిర్మించుకుంది. అజిత్ మే 3న ఆలయంలో దీపం వెలిగించి భక్తి గీతాలు స్పీకర్లో ప్లే చేశారు. స్పీకర్ వినియోగించడంపై సదాజి థాకూర్తోపాటు మరో ఐదుగురు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ సౌండ్ తక్కువగానే ఉందని బాధితులు చెప్పినా వినిపించుకోలేదు. సదాజీతోపాటు మరో ఐదుగురు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. కర్రలతో చితకబాదారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధిత సోదరులను మెహ్సనా హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలవ్వడంతో అహ్మదాబాద్ హాస్పిటల్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి చేరుకునేలోపే జశ్వంత్ చనిపోయాడని వైద్యులు తేల్చారు.