భార్యను ఇంటికి పంపలేదని.. అత్తను దారుణంగా చితకబాదిన అల్లుడు.. చివరికి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-05-26T11:04:47+05:30 IST

భర్త చేతిలో విపరీతంగా తన్నులు తిని ఇంటికి వచ్చేసిందా ఇల్లాలు. తను అలా రావడమే తల్లిదండ్రుల పాలిట శాపం అవుతుందని ఆమె ఊహించలేదు. ఈ ఘటన బిహార్‌లోని బాకాలో వెలుగు చూసింది. మూడేళ్ల క్రితం ఊర్మిళా దేవి, ఆమె భర్త తమ కుమార్తె విభాను సంజయ్ యాదవ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే పెళ్లయిన తర్వాత భర్త తనను విపరీతంగా హింసిస్తున్నాడని విభా ఆరోపించింది...

భార్యను ఇంటికి పంపలేదని.. అత్తను దారుణంగా చితకబాదిన అల్లుడు.. చివరికి ఏమైందంటే..

భర్త చేతిలో విపరీతంగా తన్నులు తిని ఇంటికి వచ్చేసిందా ఇల్లాలు. తను అలా రావడమే తల్లిదండ్రుల పాలిట శాపం అవుతుందని ఆమె ఊహించలేదు. ఈ ఘటన బిహార్‌లోని బాకాలో వెలుగు చూసింది. మూడేళ్ల క్రితం ఊర్మిళా దేవి, ఆమె భర్త తమ కుమార్తె విభాను సంజయ్ యాదవ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే పెళ్లయిన తర్వాత భర్త తనను విపరీతంగా  హింసిస్తున్నాడని విభా ఆరోపించింది. ఒక పిల్లాడు పుట్టిన తర్వాత కూడా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో అత్తారిల్లు వదిలి పుట్టింటికి వచ్చేసింది. 


అప్పటి నుంచి తన భార్యను కాపురానికి పంపాలని సంజయ్ గొడవ చేయడం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా విభా మాత్రం మెట్టినింటికి వెళ్లడానికి నిరాకరించింది. ఈ క్రమంలో గత శనివారం కూడా సంజయ్.. భార్య కోసం ఆమె ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఎక్కడికో వెళ్లి వస్తున్న భార్యను అడ్డగించాడు. ఆమెను తనతో రావాలంటూ బలవంతం చేశాడు. ఆమె వినకపోవడంతో కొట్టాడు. అడ్డుకున్న అత్త ఊర్మిళా దేవిని బలంగా తోశాడు. దాంతో రాయిపై పడిన ఆమె తల పగిలింది. అది చూసి కేకలు వేసిన మామపై కత్తితో దాడి చేశాడు. 


అత్తను కూడా మరోసారి పొడిచి పారిపోయాడు. తగిలిన గాయాలతోనే ఊర్మిళా దేవి కన్నుమూసింది. గ్రామస్థులతోపాటు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-05-26T11:04:47+05:30 IST