ప్రేమించిన యువతిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు.. ఆమె ద్వారా లక్షలు సంపాదించాలని ప్లాన్.. ఇంతకీ అతనేం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-28T05:42:35+05:30 IST

మ్యాట్రిమోనీ ద్వారా ఒక యువతి ఒక బీ టెక్ చదువుకున్న యువకుడు పరిచయమయ్యాదు. ఆ తరువాత ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకొని ప్రేమించుకున్నారు. కొంత కాలం తరువాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలో ఆ యువతి ఆ యువకుడిపై బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టింది...

ప్రేమించిన యువతిని బ్లాక్ మెయిల్ చేసిన యువకుడు.. ఆమె ద్వారా లక్షలు సంపాదించాలని ప్లాన్.. ఇంతకీ అతనేం చేశాడంటే..

మ్యాట్రిమోనీ ద్వారా ఒక యువతి ఒక బీ టెక్ చదువుకున్న యువకుడు పరిచయమయ్యాదు. ఆ తరువాత ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకొని ప్రేమించుకున్నారు. కొంత కాలం తరువాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలో ఆ యువతి ఆ యువకుడిపై బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టింది. ఆ యువకుడు ఏం చేశాడంటే..


వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన సాహిల్ సచ్‌దేవ(32) బీటెక్, ఎంబీఏ చదువుకున్నాడు. పెళ్లి చేసుకుందామని మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టాడు. అందులో అతనికి మీనా అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ శారీరకంగా కూడా ఏకమయ్యారు. కానీ ఆ తరువాత ఒక రోజు ఆ యువతికి సాహిల్ ఫోన్ చేసి రూ.2 లక్షలు కావాలన్నాడు. లేకపోతే అతని వద్ద ఆమెకు సంబంధించిన నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఆ యువతి తాను మోసపోయానని గ్రహించి.. పోలీసులకు సాహిల్‌పై ఫిర్యాదు చేసింది. 


పోలీసులు ఆమె ఫిర్యాదుపై విచారణ మొదలుపెట్టారు. ఇది తెలిసిన సాహిల్ పరారయ్యాడు. పోలీసులు అతని ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారు. ఆ తరువాత తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అతడు ఇంతకు ముందు కూడా ఇలాగే మరో ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి వారి వద్ద నుంచి లక్షలు కాజేసినట్లు తెలిపాడు. 


పోలీసులు సాహిల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


Updated Date - 2022-01-28T05:42:35+05:30 IST