భార్యపై అనుమానం.. ఫోన్ కూడా చేయకుండా ఇంటికి వెళ్లిన భర్త ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే..

ABN , First Publish Date - 2021-07-27T01:16:22+05:30 IST

పెళ్లి తర్వాత పక్క సిటీలో ఉద్యోగం చేయడానికి వెళ్లాడా భర్త. అయితే తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలియడంతో షాకయ్యాడు. అనుమానం తీర్చుకోవాలని ఫోన్ కూడా చేయకుండా ఇంటికెళ్లాడు.

భార్యపై అనుమానం.. ఫోన్ కూడా చేయకుండా ఇంటికి వెళ్లిన భర్త ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి తర్వాత పక్క సిటీలో ఉద్యోగం చేయడానికి వెళ్లాడా భర్త. అయితే తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలియడంతో షాకయ్యాడు. అనుమానం తీర్చుకోవాలని ఫోన్ కూడా చేయకుండా ఇంటికెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తీసిన భార్య.. ఎదురుగా నిలబడిన భర్తను చూసి నివ్వెరపోయింది. అదే సమయంలో బెడ్రూంలో నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చారు. వారిని చూసిన భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో తెగించిన భార్య, తనతో ప్రియులతో కలిసి భర్తపై దాడికి దిగింది. ముగ్గురూ కలిసి ఆ భర్తను చితకబాదారు. అంతటితో ఆగకుండా అతన్ని భవనం నాలుగో అంతస్థుపై నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగు చూసింది.


హిమాంషు చౌహాన్ అనే యువకుడు రతలామ్‌ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య ఇండోర్‌లో ఉంటోంది. భార్యపై అనుమానం వచ్చిన హిమాంషూ.. చెప్పాపెట్టకుండా ఇంటికొచ్చాడు. తీరాచూస్తే భార్య తమ బెడ్రూంలో మరో ఇద్దరు యువకులతో కనిపించింది. దీంతో కోపంతో ఊగిపోయి వాగ్వాదానికి దిగాడు.  అప్పుడు అతని భార్య, ఇద్దరు యువకులు అతనిపై దాడి చేసి, నాలుగో అంతస్థు నుంచి కిందకు తోసేశారు. హిమాంషూ కేకలు విన్న చుట్టుపక్కల ఇళ్లలోని వాళ్లు బయటకు వచ్చి చూడగా.. కింద పడిపోయి రక్తపు మడుగులో ఉన్న హిమాంషూ కనిపించాడు. అతన్ని వెంటనే మహారాజా యశ్వంత్ రావ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకొని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఏం జరిగిందని హిమాంషూను ప్రశ్నించగా.. కాలుజారి పడ్డానని ట్విస్ట్ ఇచ్చాడతను. అయితే అతని కుటుంబం మాత్రం ఇద్దరు యువకులతో కలిసి భార్యే అతన్ని ఇలా కిందకు తోసేసిందని, నిజం చెప్పకుండా అతన్ని బెదిరిస్తోందని చెప్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-27T01:16:22+05:30 IST